భారత్ తో టీ20: కివీస్ లక్ష్యం 203 | Sakshi
Sakshi News home page

భారత్ తో టీ20: కివీస్ లక్ష్యం 203

Published Wed, Nov 1 2017 8:35 PM

Dhawan and rohit sharma continues form 

సాక్షి, న్యూఢిల్లీ : న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో ఓపెనర్లు శిఖర్ ధావన్ (51 బంతుల్లో80: 9ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ(55 బంతుల్లో 80: 6 ఫోర్లు, 4 సిక్సర్లు ) హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోరు చేసింది. పటిష్ట కివీస్ కు భారత్ 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత్ నిర్ణీత ఓవర్లాడి 3 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో సోదీ 2 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్ కు ఓ వికెట్ దక్కింది.

అంతకుముందు టాస్ ఓడి భారత్ బ్యాటింగ్ కు దిగింది. తొలుత 37 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో ధావన్ హాఫ్ సెంచరీ చేయగా, ఆపై రోహిత్ శర్మ 42 బంతుల్లో 3 సిక్సర్లు 2 పోర్ల సాయంతో అర్థ శతకం సాధించాడు. 15వ ఓవర్లో ముఖ్యంగా శాంట్నర్ ను లక్ష్యంగా చేసుకుని రోహిత్ షాట్లు ఆడాడు. ఆ ఓవర్లో సిక్సర్ తో హాఫ్ సెంచరీ చేసుకున్న రోహిత్.. ఆ తర్వాతి వరుస బంతులను బౌండరీలకు తరలించాడు. రోహిత్, శిఖర్ ల ధాటికి 16వ ఓవర్లో ప్రధాన పేసర్ బౌల్ట్ 18 పరుగులు సమర్పించుకున్నాడు. 17 వ ఓవర్లో సోది 2 వికెట్లు తీయడంతో పాటు కేవలం 2 పరుగులే ఇవ్వడంతో కాస్త జోరు తగ్గింది. చివర్లో కోహ్లీ (11 బంతుల్లో  26 నాటౌట్: 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ రెండొందల మార్కును చేరుకుంది. రెండు బంతులాడిన ధోనీ(7 నాటౌట్) ఓ సిక్సర్ బాదడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement